Rajeev Kanakala: రాజీవ్​ కనకాలకు పోలీసుల నోటీసులు.. ఎందుకంటే?

ప్లాట్​ విక్రయంలో మోసం జరిగిందని సినీ నటుడు, ఫేమస్​ యాంకర్ సుమా కనకాల భర్త రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హైదరాబాద్​లోని హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 421లోని ఒక వివాదాస్పద ప్లాటు విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్‌ను విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. రాజీవ్ కనకాల ఈ ప్లాటును సినీ నిర్మాత గుత్తా విజయ్ చౌదరికి విక్రయించారు. కానీ ఈ ప్లాట్​ రాజీవ్ కనకాల యాజమాన్యంలో లేదని తేలింది.

విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ఆ తర్వాత విజయ్ చౌదరి ఇదే ప్లాట్​ ను డిండి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి రూ.70 లక్షలకు అమ్మారు. అసలు లేని ప్లాట్​ ను ఉన్నట్లు చూపించి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసం విషయం బయటకు రావడంతో హయత్‌నగర్ పోలీసులు గుత్తా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దీంతో సాక్షిగా పేర్కొంటూ రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే, తన ఆరోగ్యం సరిగా లేదని, తర్వాత వస్తానని రాజీవ్ కనకాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *