మీరు వాడుతున్న ‘పసుపు’ స్వచ్ఛమైనదేనా?.. ఇలా చెక్ చేయండి

Mana Enadu : కల్తీ పాలు.. కల్తీ నెయ్యి.. కల్తీ ఆహారం.. పిల్లలు తినే ఐస్ క్రీమ్ (Adultrated Ice Creams) ల నుంచి పెద్దలు తినే బిర్యానీ వరకు ప్రస్తుతం దేశంలో అందరినీ వణికిస్తోంది ఆహార కల్తీ. ఇది ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతోంది. నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ కొంతమంది దుర్మార్గులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల మార్కెట్ లో కల్తీ పసుపు(Adulterated Turmeric) వెలుగులోకి రావడం ప్రజలను తీవ్రంగా కలవరం పెడుతోంది. మరి మీరు ఉపయోగిస్తున్న పసుపు స్వచ్ఛమైందో లేదో తెలుసుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

కల్తీ పసుపు ఇలా గుర్తించండి

మీరు వాడుతున్న పసుపు కల్తీదో కాదో గుర్తించేందుకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) ఓ చిన్న ప్రయోగం చేస్తూ ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో.. కల్తీ పసుపు(Kalthi Pasupu)ను గుర్తించేందుకు రెండు గ్లాసుల నీటిలో ఓ టేబుల్ స్పూను పసుపు వేయాలి. అది స్వచ్ఛమైనది అయితే నీరంతా లేత పసుపు రంగులోకి మారి పసుపు గ్లాసు అడుగుకు చేరుకుంటుంది. కల్తీదయితే గ్లాసులోని నీరు చిక్కటి పసుపు రంగులోకి మారుతుంది. 

ఇవి స్వచ్ఛమైన పసుపు కొమ్ములేనా?

పసుపు కొనుగోలు చేస్తే మార్కెట్లో కల్తీది విక్రయిస్తున్నారని భావించి.. పసుపు కొమ్ములే(Turmeric Cones) కొంటే ఈ సమస్య ఉండదని కొందరు పసుపు కొమ్ములు పట్టించి వాడుతుంటారు. అయితే ఇవి కూడా కల్తీ అవుతున్నాయట. మరి పసుపు కొమ్ములు కల్తీవా కావా అని గుర్తించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మరో వీడియో రూపొందించింది. నకిలీ పసుపు కొమ్ములని గుర్తించడానికి రెండు గ్లాసుల నీటిలో రెండు పసుపు కొమ్ములు వేయాలి. స్వచ్ఛమైన పసుపు కొమ్ములున్న గ్లాసులోని నీరు రంగు మారదు.  నకిలీ కొమ్ములున్న గ్లాసులోని రంగు మారుతుంది. 

మరికొన్ని చిట్కాలు 

  • అసలైన పసుపుకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. కల్తీ పసుపునకు స్మెల్ ఉండదు.
  • నాణ్యమైన పసుపును చేతిలోకి తీసుకున్నప్పుడు మృదువుగా, మెత్తగా ఉంటుంది. కల్తీ పసుపు కొద్దిగా గరుకుగా లేదా ముద్దగా ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *