హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు వెల్లడించింది.
* మొదటి రెండు స్టాప్లకు రూ.12
* రెండు నుంచి 4 స్టాప్ల వరకు రూ.18
* 4 నుంచి 6 స్టాప్ల వరకు రూ.30
* 6 నుంచి 9 స్టాప్ల వరకు రూ.40
* 9 నుంచి 12 స్టాప్ల వరకు రూ.50
* 12 నుంచి 15 స్టాప్ల వరకు రూ.55
* 15 నుంచి 18 స్టాప్ల వరకు రూ.60
* 18 నుంచి 21 స్టాప్ల వరకు రూ.66
* 21 నుంచి 24 స్టాప్ల వరకు రూ.70
* 24 స్టాప్లు.. ప్రయాణానికి రూ.75






