Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్.. కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వచ్చారు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేశ్ వెంటనే కారును అడ్డుకున్నారు. రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దంటూ సూచించారు. అయితే కానిస్టేబుల్ చెబుతున్నా ఏమాత్రం వినకుండా రాంగ్‌ రూట్‌లోనే ముందుకు వెళ్లేందుకు హీరో ప్రయత్నించారు.

కానిస్టేబుల్ పైనుంచి కారును పోనిచ్చే ప్రయత్నం 

ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌కు మధ్య కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. కారును ఆపేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించగా.. ఆయన మీదుగానే కారును పోనిచ్చేందుకు బెల్లంకొండ యత్నించారు. ఇదే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్

ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌‌గా మారింది. బెల్లంకొండపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ హీరోలు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించరా.. రాంగ్ రూట్‌లో ఎలా వెళ్తారంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేశ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీసీ టీవీ ఫుటేజ్‌‌తో పాటు వీడియోలను కూడా పరిశీలించిన ఉన్నతాధికారులు బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *