GHMC: ముగ్గులు వేస్తూ అవగాహన కల్పిస్తూ..బల్దియా సరి‘కొత్త’ప్రయత్నం..

మన ఈనాడు: మహనగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి..ఇంటింటికి చెత్త సేకరించే ఆటోలు, రిక్షాలు వెళ్తున్నా..రోడ్లుపై చెత్త కుప్పలు మాత్రం పెరుగుతున్నాయి. వీటిని తొలగించేందుక జీహెచ్​ఎంసీ(GHMC) సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

ఉప్పల్​ సర్కిల్​ పరిధిలోని రామంతాపూర్​, హబ్సిగూడ, చిల్కానగర్​, ఉప్పల్​ డివిజన్ల పరిధిలోని నిత్యం చెత్త వేసే ప్రాంతాలను బల్దియా అధికారులు గుర్తించారు. వీటిని గ్రీన్​ కర్టెన్స్​గా మార్పు చేశారు. ఈప్రాంతాల్లో పారిశుద్ద్య సిబ్బంది అందమైన ముగ్గులు వేస్తూ చెత్త వేయకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు.

పొదుపు సంఘాల రిసోర్స్​ పర్సన్​లతో సమన్వయ్యం చేసుకుంటూ చెత్తవేసే వారిని గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించేలా చైతన్యకార్యక్రమాల బాధ్యతలను తీసుకుంది ఉప్పల్​ సర్కిల్​. ప్రత్యేకంగా ఒక్కొ కార్మికుడిని సెక్యూరిటీగా ఉంచి చెత్త వేసేవారికి రూ.1000ల చలానా సైతం విధిస్తున్నారు.

జీహెచ్​ఎంసీ చెత్త కట్టడికి చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారు. అందమైన నగరంలో చెత్త కుప్పులు వేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే అవసరమైతే మరికొన్ని చెత్త రిక్షాలను కాలనీలకు పెంచేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Related Posts

నాగారంలో చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మేడ్చల్ జిల్లా కీసర మండంలోని నాగారం మున్సిపాలిటీలో ఉన్న శ్రీ వేంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్(Sri Venkata Marakata Chandramoulishwara Hanuman) దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి.…

Rain Alert: అకాల వర్షం.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ(Telangana)లో అకాల వర్షాలు(Rains) అతలాకుతలం చేశాయి. దీంతో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షంతో నగర రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భారీ వరదకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *