హైడ్రా అంటే కూల్చివేత‌లే కాదు.. పేదల జోలికి వెళ్లదు : రంగనాథ్

Mana Enadu : హైదరాబాద్ మహానగరం పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను చెరబట్టి అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా (Hydra) ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. అయితే నివాసాలను కూడా హైడ్రా కూల్చివేస్తోందని (Hydra Demolitions) వార్తలు వస్తున్నాయి. బాధితులు కూడా మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఏళ్ల పాటు కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కట్టుకున్న ఇంటిని క్షణాల్లో కూల్చివేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు.

కూల్చివేతలన్నీ హైడ్రావి కావు

ఈ నేపథ్యంలో హైడ్రా తాజాగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఓ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కూల్చివేతలకు హైడ్రాను ఆపాదిస్తున్నారని మండిపడింది. ఈ మేరకు హైడ్రా పరిధి గురించి తన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. హైడ్రా అంటే కూల్చివేత‌లే కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Ranganath) అన్నారు. దాని ప‌రిధి ఔట‌ర్ రింగు రోడ్డు వ‌ర‌కేనని స్పష్టం చేశారు. న‌గ‌రంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖ‌రుకు ఇత‌ర రాష్ట్రాల్లో కూల్చివేత‌లు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్య‌మాలు ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయని మండిపడ్డారు.

హైడ్రా పేదల జోలికి వెళ్లదు 

హైడ్రా పేద‌ల నివాసాల జోలికి వెళ్ల‌దని రంగనాథ్ స్పష్టం చేశారు. అలాగే నివాసం ఉండే ఇళ్ల‌ను కూల్చ‌దని పునరుద్ఘాటించారు.  కూల్చివేత‌ల‌న్నీ హైడ్రావి కావని తేల్చి చెప్పారు. ప్ర‌జ‌లు, సామాజిక మాధ్య‌మాలు ఈ విషయాన్ని గుర్తించాలని వెల్లడించారు.  ప్ర‌కృతి వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌, చెరువులు (Ponds), కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల (Floods) స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చ‌ర్య‌లు చేపట్టం హైడ్రా విధి అని ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *