Indw vs Engw 1st ODI: అదరగొట్టిన దీప్తి శర్మ.. తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ జయభేరి

టీమ్ఇండియా మహిళల క్రికెట్( India Women) జట్టు మరోసారి సత్తా చాటింది. సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌(England)ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇటీవల ఇంగ్లండ్‌పై 3-2 తేడాతో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్(Harmanpreet) సేన.. తాజాగా వన్డే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. అమన్ జ్యోత్(Amanjot Kaur), క్రాంతి(Kranti)ల ధాటికి 20 పరుుగలకే తొలి రెండు వికెట్లను త్వరగా కోల్పోయింది.

ENG-W vs IND-W Highlights, 1st ODI: Deepti's unbeaten knock leads India to four-wicket victory - Sportstar

రాణించిన పేసర్లు

యువ పేసర్ క్రాంతి గౌడ్ తన రెండో వన్డేలోనే ఎమీ జోన్స్ (1), టామీ ఓపెనర్ టామీ బ్యూమాంట్ (5) వికెట్లను పడగొట్టి సంచలనం సృష్టించింది. అయితే, సోఫియా డంక్లీ (83 నాటౌట్, 92 బంతుల్లో), ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ (53, 73 బంతుల్లో) ఐదో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. చివర్లో సోఫీ ఎకల్‌స్టోన్ ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 258/6 స్కోరు సాధించింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో రెండు వికెట్లు తీశారు.

Image

మరో 10 బంతులు మిగిలి ఉండగానే..

అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు స్మృతి మంధాన (28), ప్రతీకా రావల్ (36) ఓపెనింగ్ భాగస్వామ్యంతో 48 పరుగుల శుభారంభం అందించారు. అయితే, మధ్యలో వికెట్లు కోల్పోయి 124/4తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో దీప్తి శర్మ (62 నాటౌట్, 62 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ (48) కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. చివర్లో అమన్‌జోత్ కౌర్ (20 నాటౌట్, 14 బంతుల్లో) దీప్తితో కలిసి 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మ(Deepti Sharma) తన అద్భుతమైన ఆటతీరుతో ‘Player of the match’ అవార్డు అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే జులై 19న లార్డ్స్‌లో జరగనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *