
ఇటీవల జమ్మూకశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India) పాకిస్థాన్కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల(Sindu River Water) ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. పలు కీలక ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్థాన్కు మరో షాకిచ్చింది. పాక్ నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల మెయిల్స్(Mails), పార్సిళ్ల మార్పిడి(Exchange of parcels)ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఎయిర్ వే, రోడ్డు, సముద్ర మార్గం ద్వారా వచ్చినా ఈ నిషేధం(Ban) వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే పాకిస్థాన్(Pakistan) నుంచి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జరిగే అన్ని రకాల దిగుమతుల(Imports)పై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న మెయిల్స్, పార్సిళ్ల నిలిపివేత నిర్ణయం ఈ ఆంక్షల పరంపరలో మరొకటి. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య సముద్ర మార్గ రవాణా(Sea transport)ను కూడా భారత్ మూసివేసింది.
ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతి పరిమితం చేసేలా..
పాకిస్థాన్ జెండాతో ప్రయాణించే ఏ నౌక అయినా భారత ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. కాగా, పాకిస్థాన్ విమానాలు(Pakistan Airlines) భారత గగనతలంపై ప్రయాణించకుండా ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. వీటితో పాటు, పాకిస్థాన్కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతి(Export of e-commerce goods)ని కూడా పరిమితం చేసే దిశగా భారత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Nikhil: అలాంటి దేశాలకు వెళ్లడం అవసరమా?.. ఆలోచించుకోండి: హీరో నిఖిల్
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం…