Operation Sindoor: టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే.. పాక్ కాదు: రాజ్‌నాథ్ సింగ్

భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ ద్వారా పాకిస్థాన్‌(Pakistan)కు గట్టి గుణపాఠం చెప్పామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. భారత సైనికులు రాత్రికి రాత్రే అద్భుత పరాక్రమం ప్రదర్శించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం(Destruction of terrorist camps) చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. సరిహద్దు రహదారుల సంస్థ (BRO) చేపట్టిన పలు ప్రాజెక్టులను ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేవలం ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేశాం..

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “మన సైనికులు(Army) రాత్రికి రాత్రే అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఉగ్రవాద శిబిరాలపై అత్యంత సాహసోపేతమైన దాడులు చేసి తమ సత్తా చాటారు. ఈ ఆపరేషన్‌లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, కేవలం ఉగ్ర శిబిరాల(terrorist camps)నే లక్ష్యంగా చేసుకున్నారు” అని వివరించారు.

PM మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు

పహల్గామ్‌(Pahalgam)లో అమాయక పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాదులనే మట్టుబెట్టామని ఆయన తెలిపారు. దేశ భద్రత(National security)కు విఘాతం కలిగించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన PM మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతిచర్యగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరిట మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు మరణించారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *