పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పూంచ్ జిల్లా (Poonch district) లో నియంత్రణ రేఖ (Line of Control) వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఒక పాకిస్థానీని ఆర్మీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

పాక్ రేంజర్స్ అదుపులో భారత జవాన్
సోమవారం కూడా పంజాబ్(Punjab)లోని గురుదాస్పూర్ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడ్డ ఒక పాకిస్థాన్ జాతీయుడిని BSF జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే తాజాగా మరో పాకిస్థానీ భారత్లో చొరబడ్డాడు. ఇదిలావుంటే ఏప్రిల్ 23న ఒక BSF జవాన్ను పాకిస్థాన్ రేంజర్స్(Pakistan Rangers) అదుపులోకి తీసుకున్నారు. కాగా భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్(Mock Drill) నిర్వహిస్తోంది.







