Allu Arjun: బన్నీ-త్రివిక్రమ్ మూవీ.. లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా?

పుష్ప-2 గ్రాండ్ సక్సెస్‌తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun). ఇక అదే జోష్‌లో మరో ప్రాజెక్టును పట్టాలెకిస్తున్నాడు. జులాయి, S/o సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బన్నీ-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Director Trivikram Srinivas) కాంబోలో మరో మూవీ రానున్న సంగతి తెలిసింది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రిలీజ్ ఎప్పుడవుతుంది? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ-త్రివిక్రమ్ మూవీ(Bunny-Trivikram movie)పై ఓ క్రేజీ గాసిప్ వినిపిస్తోంది.

రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాకే..

ప్రస్తుతం అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. పుష్ప-2(Pushpa2)కోసం దాదాపు రెండేళ్లుగా వర్క్ చేసిన ఆయన కాస్త ఫ్రీ టైం తీసుకొని ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్‌తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఫస్ట్ షెడ్యూల్‌లో బన్నీ పాల్గొనడం లేదని, రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాక.. జూన్ నుంచి బన్నీ షూట్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

rspnetwork.in: Allu Arjun - Trivikram Srinivas movie pooja

మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్-బన్నీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ మూవీని హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్(Geetha Arts) సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్‌(Thaman) మ్యూజిక్ అదించబోతున్నాడు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *