విద్యార్థులకు అలర్ట్.. నేడే ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 20వ తేదీ) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డు వెబ్ సైటు నుంచి ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Andhra Pradesh Intermediate Board) వెల్లడించింది. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.

నేడే ప్రాక్టికల్స్ ముగింపు

ఏపీ వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు (AP Inter First Year Exams), మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్‌ పరీక్షలు మార్చి 15వ తేదీతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్‌ పరీక్షలు నేటితో పూర్తవుతాయి.

పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ

ఈ ఏడాదికి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం 5,00,963 మంది జనరల్‌ విద్యార్థులు, 44,581 మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సెకండ్ ఇయర్ (Inter Second Year Exams) విద్యార్ధుల్లో 4,71,021 మంది జనరల్‌, 42,328 మంది ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

Related Posts

Mufasa:The Lion King: ఓటీటీలోకొచ్చిన ముఫాసా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్(Hollywood) బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్ (Mufasa The Lion King)’ డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ‘ది లయన్ కింగ్(he Lion King)’ సినిమాకు ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం…

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *