టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సిరాజ్ ప్రెస్కాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది అదే. ఆకాశ్ దీప్ గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతను ఈ రోజు బౌలింగ్ చేశాడు. ఇక ఫిజియోలు చూసుకుంటారు. వారి నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. టీమ్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. మనం ఓపికగా ఉండాలి. సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయాలి. అదే మా ప్లాన్’అని చెప్పాడు.
వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలనుకుంటున్నా..
ఇక తన వర్క్లోడ్(Workload) గురించి మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేశం కోసం వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలనుకుంటున్నా.’ అని తెలిపాడు. అలాగే, మూడో టెస్టులో తాను అవుటైన తీరుపై స్పందిస్తూ..‘చాలా ఎమోషన్ అయ్యాను. 22 పరుగులతో ఓడటం బాధగా అనిపించింది. నేను అవుటవుతానని అనుకోలేదు. అది నా తప్పిదమే. అది చాలా హృదయ విదారకమైనది. ఆ మ్యాచ్లో మేము గెలిస్తే పరిస్థితులు మరోలా ఉండేవి. ఆ బాధ చాలా కాలం ఉంటుంది. జడ్డూ భాయ్ పోరాడాడు. సిరీస్ ఇంకా ముగియలేదు. నేను నా బ్యాటింగ్ మెరుగుపర్చుకోవడానికి కష్టపడుతున్నా’ సిరాజ్ అని చెప్పుకొచ్చాడు.
With 13 wickets in three Tests, Siraj is one of India’s stand-out performers this series, and hopes to play many games for the country and help the team win.
In Manchester, as he reveals, he will have Jasprit Bumrah for company. 🤝#ENGvIND pic.twitter.com/xSJzgicLYE
— Sportstar (@sportstarweb) July 22, 2025






