Jubilee Hills Bypoll-2025: ఈసీకి చేరిన గెజిట్.. డిసెంబర్‌లోపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక?

రాష్ట్రంలో మరో ఉపఎన్నిక(By Elections)కు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్(JubileeHills) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills Bypoll)పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి(Chief Electoral Officer Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ(Election Commission) ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు తమకు గెజిట్(Gazette) వచ్చిందన్నారు. దాన్ని తాము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వివరించారు. అయితే.. డిసెంబర్ లోగా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉందన్నారు.

బలమైన అభ్యర్థి కోసం పార్టీల వెతుకులాట

కాగా గత ఎన్నికల్లో ఆయన BRS విజయం సాధించింది. దీంతో మరో సారి తమ సిట్టింగ్ సీటును దక్కించుకోవాలని గులాబీ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు ప్రారంభించింది. మాగంటి కుటుంబం నుంచే ఆ పార్టీ అభ్యర్థిని పోటీలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా ఎలాగైనా జూబ్లీహిల్స్(JubileeHills)లో ఈ సారి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో క్రికెటర్ అజారుద్దీన్‌ (Azharuddin)కు టికెట్ ఇచ్చిన ఆ పార్టీ.. ఈసారి కొత్త అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అటు BJP కూడా ఈ ఉపఎన్నికను సీరియస్‌గానే తీసుకునే ఛాన్సుంది. మొత్తంగా మూడు పార్టీలు బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం.

Maganti Gopinath Jubilee Hills bypolls heating up Lobbying in congress and BJP Jubilee Hills Bypolls: హీటెక్కిస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్ వార్.. మాగంటి ఫ్యామిలీ పోటీ చేస్తుందా? కాంగ్రెస్, బీజేపీలో టికెట్ రేసు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *