Jyoti team: ఫైనల్లో జ్యోతి బృందం

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4 పోటీల కాంపౌండ్‌ విభాగంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి.

పారిస్‌: ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4 పోటీల కాంపౌండ్‌ విభాగంలో భారత మహిళలు, పురుషుల జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రజత పతకాలు ఖరారు చేసుకున్నాయి. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో వెన్నం జ్యోతి సురేఖ, అదితి, పర్నీత్‌ కౌర్‌లతో కూడిన బృందం 234-233తో బ్రిటన్‌పై నెగ్గింది. టాప్‌ సీడ్‌ జ్యోతి త్రయం ఫైనల్లో మెక్సికోతో తలపడనుంది.

పురుషుల టీమ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో ఓజాస్‌ ప్రవీణ్‌ డియోటలే, ప్రథమేష్‌, అభిషేక్‌ వర్మలతో కూడిన భారత జట్టు కొరియాపై గెలిచింది. తొలుత 235-235తో ఇరు జట్ల స్కోర్లు సమం కాగా, అనంతరం షుటౌట్‌లోనూ 30-30తో టై అయింది. దీంతో రెఫరీలు బుల్‌ ఐకి దగ్గరగా విల్లులు సంధించిన భారత బృందాన్ని విజేతగా ప్రకటించారు. స్వర్ణ పోరులో అమెరికాను భారత జట్టు ఢీకొననుంది.

  • Related Posts

    JioHotstar: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్.. యూజర్లకు జియో గుడ్‌న్యూస్

    మ‌రో ఐదు రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియం లీగ్ (IPL)కు తెర‌లేవ‌నుంది. ఈ నెల 22 నుంచి ఈ మెగా క్రికెట్ సంబంరం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ను డిజిట‌ల్ వేదిక‌గా జియో(JIO)…

    డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ.. ఆ మూవీలో వార్నర్ రెమ్యునరేషనెంతంటే?

    మైదానంలో తనదైన స్టైల్లో బౌలర్లపై విరుచుకుడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) మరో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల(Nitin-Sreeleela) జంటగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్(Robinhood)’ మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *