MUDA కేసు.. కర్ణాటక ముఖ్యమంత్రికి హైకోర్టు షాక్

ManaEnadu:కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. సీఎం కుటుంబానికి మంగళూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ-MUDA స్థలం కేటాయింపు వ్యవహారంపై గవర్నర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరంలో ఖరీదైన స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ ఆరోపణలు చేశాయి.

ఈ ఆరోపణలతోనే ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణలు గవర్నర్ కు సీఎం సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఫిర్యాదులో కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని గవర్నర్ తొలుత ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత సిద్ధరామయ్యపై విచారణకు అనుమతించారు.

అయితే గవర్నర్ ఆదేశాలపై సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం గవర్నర్‌ చర్యను సమర్థిస్తూ.. సీఎంపై విచారణకు అనుమతించింది. విచారణ జరిపే వరకూ ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌ కోర్టును హైకోర్టు ఆదేశించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *