‘డీలిమిటేషన్’ ఇష్యూ.. నేడు దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ

డీలిమిటేషన్(Delimitation) అంశంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు నేడు భేటీ కానున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(Tamil Nadu CM MK Stalin) అధ్వర్యంలో చెన్నై(Chennai)లో ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth), BRS నేత KTRతో పాటు 7 రాష్ట్రాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సమావేశం లక్ష్యం నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు ఎదురయ్యే సవాళ్లను చర్చించడం, ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం. ఇప్పటికే ఈ భేటీ కోసం తెలంగాణ సీఎం రేవంత్ చెన్నైకి చేరుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

ఈ సమావేశంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య(Number of constituencies)ను పెంచడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

DMK MPs stage a protest on the issue of delimitation, at Parliament House premises in New Delhi on Thursday. (ANI PHOTO)

రేవంత్ రెడ్డి, స్టాలిన్ మధ్య ప్రాథమిక చర్చలు

సమావేశానికి ముందు రేవంత్ రెడ్డి, స్టాలిన్ మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయనీ, ఈ అంశంపై కాంగ్రెస్, డీఎంకేలు ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నాయని సమాచారం. కేటీఆర్ హాజరవడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. BRS ఈ విషయంలో దక్షిణ రాష్ట్రాలతో కలిసి నడవాలని భావిస్తోంది. ఈ సమావేశంలో రాజ్యసభ(Rajyasabha), లోక్‌సభ(Loksabha) స్థానాల సంఖ్యపై జనాభా ఆధారిత డీలిమిటేషన్ ప్రభావం, దాన్ని ఎదుర్కోవడానికి చట్టపరమైన, రాజకీయ చర్యలపై చర్చ జరగనుంది. ఈ సమావేశం దక్షిణ భారత రాష్ట్రాల ఐక్యతను చాటే అవకాశంగా భావిస్తున్నారు.

Tamil Nadu's MK Stalin Raises Stakes Over Delimitation, Calls 7 State Leaders To Chennai

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *