Vijay: జన నాయగన్‌ ఏ చివరి సినిమానా?.. విజయ్ ఏం చెప్పారంటే?

కోలీవుడ్‌ దళపతి విజయ్‌ (Vijay) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) మమిత బైజు హీరోయిన్లు. అయితే జన నాయగన్ ఏ విజయ్ చివరి సినిమా అని.. ఈ మూవీ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం కానున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే ప్రశ్నను తాను విజయ్‌ని ఓ సందర్భంలో అడిగినట్లు మమితా బైజు (Mamitha Baiju) తెలిపారు. దానికి ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారని అన్నారు.

‘‘జన నాయగన్‌’ షూటింగ్‌ సమయంలో ఇదే మీ చివరి సినిమానా అని విజయ్‌ను అడిగా. ‘ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది’ అని ఆయన నాతో అన్నారు. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచింది. చిత్రీకరణ చివరి రోజు నాతో పాటు అందరూ ఎమోషన్‌ అయ్యారు. విజయ్‌ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అందుకే టీమ్‌తో కలిసి ఫొటోలు కూడా దిగలేకపోయారు’ అని మమితా చెప్పారు. ఇందులో తన పాత్ర గురించి మాత్రం ఇప్పుడే చెప్పనని స్క్రీన్‌పై చూడాలన్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియమణి, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *