మంచు వారి జగడం మళ్లీ మొదలు.. మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ ఆందోళన

టాలీవుడ్ లో గత కొంతకాలంగా మంచు కుటుంబం వివాదం (Manchu Family Dispute) చర్చనీయాంశమవుతోంది. అయితే కొద్దిరోజుల నుంచి సద్దుమణిగిన ఈ గొడవ మళ్లీ మంచు విష్ణుపై మనోజ్ (Manchu Manoj) ఫిర్యాదుతో తెరపైకి వచ్చింది. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తాను రాజస్థాన్ వెళ్లగా.. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని చూసి తన సోదరుడు విష్ణు, మరికొంత మందితో కలిసి చొరబడ్డారని మనోజ్ ఆరోపించారు. తన కారును ఎత్తుకెళ్లారని, ఇంట్లో విధ్వంసం సృష్టించారని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ బైఠాయింపు

అయితే ఈ విషయంపై తన తండ్రి మంచు మోహన్ బాబు(Mohan Babu)తో మాట్లాడాలని ప్రయత్నించినా ఆయన నుంచి స్పందన రాలేదని మనోజ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసం వద్ద మంచు మనోజ్ బైఠాయించాడు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. మనోజ్‌ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో ఆయన ఇంటి బయటే బైఠాయించాడు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయి ఇంటి చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు.

నా కారు ఎత్తుకెళ్లాడు

పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్‌ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకొని ఆయన సోదరుడు విష్ణు (Manchu Vishnu) ఇదంతా చేయిస్తున్నారని మనోజ్  ఆరోపించాడు. ఈనెల 1వ తేదీన తన పాప పుట్టినరోజు సందర్భంగా జయపుర వెళ్లగా సోదరుడు విష్ణు 150 మందితో జల్‌పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన  కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్క్‌ చేశారని పోలీసులకు తెలిపాడు. జల్‌పల్లిలో తన భద్రతా సిబ్బందిపై దాడి చేశారని..  కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారని.. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్‌కు పంపించారని మనోజ్ వెల్లడించాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *