ప్రయాణికులకు అలర్ట్.. ఈనెల 27 వరకు పలు రైళ్లు రద్దు

Mana Enadu : రైలు ప్రయాణికులకు అలర్ట్. ఈనెల 16వ తేదీ (సోమవారం) నుంచి 27వ తేదీ వరకు పలు రైళ్లు (Trains Cancel) రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని గుంతకల్లు రైల్వే డీఆర్ఎం విజయ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి.. తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. పాణ్యం, బుగ్గనపల్లె, కృష్ణమ్మ కోన రైల్వే లైన్‌లో జరుగుతున్న డబ్లింగ్ పనుల (Dubling Works)కారణంగా రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు వెల్లడించారు.

గుంటూరు-డోన్ (17228), డోన్-గుంటూరు (17227) రైలు రద్దు చేసినట్లు గుంతకల్లు డీఆర్ఎం విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన పూరి- యశ్వంతపూర్ (22883), 21వ తేదీన యశ్వంతపూర్ – పూరి (22884) రైలు దారి మళ్లించినట్టు వెల్లడించారు. ఈ నెల 18, 25వ తేదీల్లో హౌరా – యశ్వంతపూర్ (22831) రైలును నంద్యాల, ఎర్రగుంట్ల, గుత్తి, అనంతరపురం మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు చెప్పారు.

ఈ నెల 20వ తేదీన యశ్వంతపూర్ – హౌరా ( 22832) రైలును అనంతపురం, గుత్తి, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయ్ కుమార్ చెప్పారు. అలాగే గుంటూరు-ఔరంగాబాద్ (17253), ఔరంగాబాద్ – గుంటూరు (17254) రైలు ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాలను గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *