Earthquake: తుర్కియేలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు

వాయవ్య తుర్కియే(Northwest Turkey)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం(Earthquake) బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిండిర్గి పట్టణంలో కేంద్రీకృతమైంది. తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ప్రకారం ఆగస్టు 10న రాత్రి 7:53 గంటలకు భూమి ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోతులో ఈ కంపనలు నమోదయ్యాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) దీని తీవ్రతను 6.19గా నిర్ధారించింది. ఇస్తాంబుల్‌తో సహా పలు ప్రావిన్సుల్లో ప్రకంపనలు తీవ్రంగా అనిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

రంగంలోకి సహాయక బృందాలు

ఈ భూకంపం ధాటికి 16 భవనాలు కూలిపోయాయని అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ(Minister Ali Yerlikaya) తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న 81 ఏళ్ల వృద్ధుడు ఆసుపత్రి(Hospital)లో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 29 మంది గాయపడ్డారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల తొలగింపు, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించే పనులు చేపట్టాయి. ప్రస్తుతం సహాయక చర్యలు పూర్తయ్యాయని, తీవ్రమైన ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్(Turkish President Recep Tayyip Erdogan) మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Image

2023లో 7.8 తీవ్రతతో భూకంపం

భౌగోళికంగా భూకంప మండలంలో ఉన్న తుర్కియేలో ఇలాంటి విపత్తులు(Disasters) తరచుగా సంభవిస్తుంటాయి. 2023లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 53,000 మంది మరణించిన నేపథ్యంలో, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన తర్వాత 4.6 తీవ్రతతో అనంతర ప్రకంపనలు నమోదయ్యాయి, దీంతో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *