Akbaruddin Owaisi : ‘ఇది గాంధీభవన్‌ కాదు.. తెలంగాణ శాసనసభ’

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions 2025) ఇవాళ కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో రాష్ట్రంలో సామాజికవర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. బీసీ కోటాకు సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచారు.

ఇది గాంధీభవన్ కాదు శాసనసభ 

అయితే సభ కొనసాగుతున్న సమయంలో మధ్యలోనే శాసనసభ నుంచి ఎంఐఎం సభ్యుల (MIM MLAs Walkout) వాకౌట్‌ చేశారు.  శాసనసభ నడుపుతున్న తీరును నిరసిస్తూ ఎంఐఎం వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ప్రభుత్వంపై మండిపడ్డారు. శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని శాసనసభలో ఖూనీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది గాంధీభవన్ కాదు… తెలంగాణ శాసనసభ అని వ్యాఖ్యానించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *