MI vs SRH: రైజర్స్‌ మళ్లీ చిత్తు.. 4 వికెట్లతో ముంబై గెలుపు

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి దారుణంగా తయారైంది. కొడితే భారీ స్కోర్లు.. లేదంటే అంతే సంగతులు. తొలి మ్యాచులోనే రికార్డు స్థాయిలో స్కోరు చేయడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సంతోషం కేవలం ఒక్క మ్యాచుకే పరిమితమైంది. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచుల్లో ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఆపై పంజాబ్‌(PBKS)పై రికార్డు స్థాయిలో టార్గెట్‌ను ఛేదించి మళ్లీ పుంజుకున్నట్లే కనిపించినా.. గురువారం ముంబైతో మ్యాచులో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ మ్యాచులో SRHపై ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది.

యార్కర్లు.. స్లో బంతులతో దెబ్బతీశారు..

ముంబైలోని వాంఖడే స్డేడియంలో జరిగిన మ్యాచులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది. అభిషేక్ 40, హెడ్ 28 పరుగులు చేసినా స్కోరు బోర్డును పరుగెత్తించలేక పోయారు. వీరు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. నితీశ్ 19, క్లాసెన్ 37 వన్డే తరహా బ్యాటింగ్ చేశారు. అనికేత్ 18, కమిన్స్ 8 రన్స్ చేయడంతో రైజర్స్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. యార్కర్లు.. స్లో బంతులతో రైజర్స్‌ను దెబ్బతీశారు. జాక్స్ 2, బౌల్ట్, బుమ్రా, పాండ్య తలో వికెట్ తీశారు.

Image

మరో 11 బంతులు ఉండగానే..

అనంతరం 163 పరుగుల లక్ష్య ఛేదనలో MI 18.1 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ర్యాన్ రికెల్టన్ 21, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, తిలక్ వర్మ 21 (నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్య 21 పరుగులు చేశారు. రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మలింగా 2, హర్షల్ పటేల్ ఒకవికెట్ తీశారు. ఈ ఓటమితో SRH ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *