ఒక ‘అవెంజర్స్‌’.. ఒక ‘బ్యాట్‌మ్యాన్‌’.. ఒక ‘దేవర’.. హాలీవుడ్ రేంజ్ లో తారక్ మూవీ

Mana Enadu : ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. గ్లోబల్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ (NTR) .. దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘దేవర (Devara)’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపత్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త అభిమానుల్లో ఆసక్తి నెలకొల్పుతోంది.

హాలీవుడ్ రేంజ్ లో దేవర

అయితే తాజాగా దేవరకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ (Anirudh) షేర్ చేశాడు. ఈ అప్డేట్ తో దేవరపై హైప్ మరొక్కసారి ఎక్కడికో వెళ్లిపోయింది. దేవర సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అన్నాడు. ‘దేవర’ (Devara) సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్‌’, ‘బ్యాట్‌మ్యాన్‌ (Batman)’ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుందని చెప్పాడు. అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నానని.. తాము ఈ సినిమాను ఎంత ఎంజాయ్‌ చేశామో వారు కూడా అదేస్థాయిలో ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

ఎలా తీశారబ్బా?

‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ (Devara Music) అందించే సమయంలో నేను షాకయ్యాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తీశారా అని అనిపించింది. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం ఛాలెంజింగ్ గా ఉంటుంది. చాలా ప్రయోగాలు చేయొచ్చు. ఫ్యాన్స్ కు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. ఈ చిత్రంలో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి.’ అని అనిరుధ్ తెలిపాడు.

రేపే రిలీజ్

కొరటాల శివ (Koratala Shiva) రూపొందించిన ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్‌ 27వ తేదీన పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.  ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *