NISAR Satellite: రేపు నింగిలోకి ‘నిసార్’.. కౌంట్‌డౌన్ షురూ!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం రేపు (జులై 30) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం 5:40 గంటలకు (భారత కాలమానం) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువు కలిగిన నిసార్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ISRO సిద్ధమైంది. మూడు దశల రాకెట్‌ అనుసంధానం పూర్తి చేసి ప్రయోగవేదికకు తరలించి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 5:30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

Image

భూమి సీక్రెట్స్‌ను కనిపెడుతుంది..

NISAR ఉపగ్రహం, భూమిని అత్యంత కచ్చితంగా పరిశీలించేందుకు రూపొందించిన మొట్టమొదటి ద్వంద్వ-ఫ్రీక్వెన్సీ(Dual Frequency) రాడార్ ఉపగ్రహం. ఇది నాసా అందించిన L-బ్యాండ్, ISRO అభివృద్ధి చేసిన S-బ్యాండ్ రాడార్‌లను కలిగి ఉంది. 12 మీటర్ల విస్తృతి గల డిప్లాయబుల్ మెష్ యాంటెన్నాతో, ఇది 242KM వెడల్పు గల స్వాత్‌ను అత్యంత కచ్చితత్వంతో పరిశీలిస్తుంది. ఈ ఉపగ్రహం భూమి ఉపరితల మార్పులను, హిమానీనదాల కదలికలను, సముద్ర మట్టాల పెరుగుదలను, భూగర్భ జలాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూస్ఖలనాల వంటి సహజ విపత్తులను పర్యవేక్షిస్తుంది.

Image

భారత్-అమెరికా మధ్య అంతరిక్ష బంధం బలోపేతం

ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు భూమిని పూర్తిగా మ్యాప్ చేస్తూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ, రాత్రి-పగలు డేటాను అందిస్తుంది. దీని డేటా సైంటిస్టులకు, పర్యావరణ పరిశోధకులకు, విధాన రూపకర్తలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోగం భారత్, US మధ్య అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభమైన కౌంట్‌డౌన్‌తో, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అంతరిక్ష ఔత్సాహికులు ఈ చారిత్రాత్మక క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *