ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mana Enadu : మలయాళీ కుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) టాలీవుడ్ లో జెంటిల్మెన్ సినిమాతో అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని(Nani)తో కలిసి ఆయనకు దీటుగా నటించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు చేజిక్కించుకుని తెలుగు ప్రేక్షకుల మది దోచేసింది. ఇటీవల ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

తాజాగా నివేదా.. ’35 చిన్న కథ కాదు (35-Chinna Katha Kaadu)’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఫిదా చేసింది.  విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్​గా నిలిచింది. ఇందులో నివేదా నటనకు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు.

ఇటీవల థియేటర్​లో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ(Ott)లోనూ ఆడియెన్స్​ను అలరించడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్ ‘Aha’ వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.  “ఈ చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది.” అంటూ ఆహా షేర్ చేసిన పోస్టర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.

స్టోరీ ఏంటంటే? ప్ర‌సాద్ (విశ్వ‌దేవ్ రాచ‌కొండ) ఓ బ‌స్ కండ‌క్టర్‌. ఆయ‌న భార్య స‌ర‌స్వ‌తి (నివేదా థామ‌స్). త‌న భ‌ర్త‌, పిల్ల‌లు అరుణ్‌, వ‌రుణ్ వీరే తన ప్రపంచంగా బ‌తుకుతున్న సాధారణ గృహిణి ఆమె. పెద్దోడికి (అరుణ్‌) లెక్క‌ల పాఠాలు ఓ ప‌ట్టాన అర్థం కావు. సున్నాకి విలువ లేన‌ప్పుడు దానిప‌క్క‌న ఒక‌టి వ‌చ్చి నిల‌బ‌డితే కూడా ప‌ది ఎందుకవుతుంద‌ంటూ అడుగుతుంటాడు.

లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) ఫండమెంటల్స్‌ను ప్ర‌శ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి లాస్ట్ బెంచ్​లో కూర్చోబెట్టి ఆరో త‌ర‌గ‌తిలో ఫెయిల్ చేస్తాడు.  ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే అతడు లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందే. ఆ ప‌రిస్థితుల్లో అరుణ్ క్లాస్‌లో హీరో ఎలా అయ్యాడు? త‌న కొడుక్కి లెక్క‌ల పాఠాలు అర్థం కావాల‌ంటూ టెన్త్ ఫెయిల్ అయిన త‌ల్లి స‌ర‌స్వతి ఏం చేసింది? అనేదే మిగ‌తా స్టోరీ.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *