ఉప్ప‌ల్ క్రికెట్‌ మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌కు నో ఎంట్రీ

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రపంచ కప్ – 2023 మ్యాచ్ నిర్వాహకులు BCCI అధికారులు మరియు HCA అధికారులతో గౌరవ రాచకొండ పోలీసు కమిషనర్ గారు ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రతిష్టాత్మకమైనవి కాబట్టి ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ స్థాయిలో క్రీడాభిమానులు ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
29 న జరిగే వార్మప్ మ్యాచ్ కు ప్లేయర్స్ మరియు బీసీసీఐ/ ఐసీసీ అధికారులు తప్ప ప్రేక్షకులను ఎవరినీ అనుమతించటం లేదని ఈ విషయాన్ని అందరూ గుర్తించి పోలీసు వారికి సహకరించ వలసిందిగా కోరడమైనది.
ఈ సమావేశంలో Rtd DGP CRPF దుర్గా ప్రసాద్, ఐపిఎస్.,DCP అభిషేక్ మహంతి,ఐపిఎస్., SOT డీసీపీ 1 గిరిధర్, ఐపిఎస్., డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీబాల, ACP నరేష్ రెడ్డి, ACP ట్రాఫిక్ శ్రీనివాస్, ఉప్పల్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మరియు BCCI అధికారులు మరియు HCA అధికారులు, DNA కంపెనీ సిబ్బంది, బుక్ మై షో ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *