గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో (Revenue Department) కొత్తగా ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్‌ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని వీటి నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిరుద్యోగులకు తీపి కబురు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ.. త్వరత్వరగా పరీక్షలు నిర్వహిస్తూ.. అంతే వేగంగా ఫలితాలు వెల్లడిస్తోంది. నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్-1,2,3 పరీక్షలు నిర్వహించి ఫలితాలు (Group 1 Results) వెల్లడించిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో వీటి నియామక ప్రక్రియ కూడా చేపట్టనున్నట్లు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ సర్కార్ మరో 10వేలకు పైగా ఉద్యోగాలు మంజూరు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *