విద్యార్థులకు అలర్ట్.. ఇక నుంచి JEE మెయిన్‌ ఎగ్జామ్​లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవ్

Mana Enadu : జేఈఈ పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్. జేఈఈ మెయిన్ పరీక్ష(JEE Main Exam) విధానంలో కీలక మార్పులు జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు ఏర్పడిన ఆటంకాల నేపథ్యంలో 2021 జేఈఈ మెయిన్స్​లో ఎన్టీఏ(NTA) మార్పులు చేసిన విషయం తెలిసిందే.

సెక్షన్ బీలో 10 ప్రశ్నలు ఇచ్చి కేవలం 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని విద్యార్థులకు ఆప్షన్ ఇచ్చిన సర్కార్.. 2024 వరకు అదే విధానాన్నికొనసాగించింది. తాజాగా 2025 నుంచి పరీక్షలో ఈ ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని ప్రకటించింది. 2021కి ముందున్న పద్ధతిలోనే పరీక్ష ఉంటుందని..  సెక్షన్ బీలో 5 ప్రశ్నలే ఇస్తామని.. ఐదింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమాచారం లేదా అప్డేట్ల కోసం, విద్యార్థులు NTA వెబ్‌సైట్ nta.ac.in లేదా JEE మెయిన్ వెబ్‌సైట్ jeemain.nta.nic.inని సంప్రదించాలని సూచించింది. 

జేఈఈ మెయిన్‌ ర్యాంకు(JEE Main Ranks)ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు ఇస్తుండగా.. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉండేది. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలుండేవి.

ఇక కరోనా సమయం(Corona Pandemic)లో విద్యార్థుల కోసం ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అలా జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండగా.. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాల్సి ఉండగా.. సెక్షన్‌ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆ ఛాయిస్‌ ఉండదని తాజాగా ఎన్టీఏ స్పష్టం చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *