
భారత సైన్యాని(Indian Army)కి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ పాకిస్థాన్(Pakistan) సాగిస్తున్న దుష్ప్రచారాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. తమ S-400, బ్రహ్మోస్ క్షిపణి(Brahmos missile) వ్యవస్థలు ధ్వంసమయ్యాయని, పలు వైమానిక స్థావరాలు, ఆయుధాగారాలపై దాడులు జరిగాయని పాకిస్థాన్ చేస్తున్న వాదనలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఉగ్రవాద శిబిరాల(Terrorist camps)పై భారత్ జరిపిన దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పాకిస్థాన్ ఈ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది.
క్షిపణి స్థావరాలు ధ్వంసం కాలేదు
దీనిపై తాజాగా కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) స్పందించారు. “పాకిస్థాన్ తమ F-17 విమానాలతో మా S-400, బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసినట్లు చెప్పుకోవడం పూర్తిగా అవాస్తవం. సిర్సా, జమ్మూ, పఠాన్కోట్, భటిండా, నలియా, భుజ్ వంటి మా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని వారు చేస్తున్న ప్రచారం కూడా కల్పితమే” అని తెలిపారు. చండీగఢ్, వ్యాస్లలోని భారత ఆయుధాగారాలు(Indian arsenals) దెబ్బతిన్నాయన్న పాక్ వాదనలు కూడా పూర్తిగా అబద్ధమని ఆమె కొట్టిపారేశారు.
Colonel Sofia Qureshi said:
Pakistan’s claim of JF 17 damaging our S400 and Brahmos missile bases and targeting mosques is completely false. #IndianArmy #IndianArmy #Ceasefire pic.twitter.com/8X6NdoXJ6y
— RS KHATANA (@rskhatana72) May 10, 2025
అంతేకాకుండా, భారత సైన్యం మసీదుల(of mosques)ను ధ్వంసం చేసిందంటూ పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలను కల్నల్ ఖురేషి తీవ్రంగా ఖండించారు. “భారత్ ఒక లౌకిక దేశమని, మా సైన్యం రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను” అని ఆమె అన్నారు.
Nikhil: అలాంటి దేశాలకు వెళ్లడం అవసరమా?.. ఆలోచించుకోండి: హీరో నిఖిల్
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం…