BREAKING: మళ్లీ బరితెగించిన పాక్.. సరిహద్దుల్లో డ్రోన్లతో దాడి

పాకిస్థాన్(Pakistan) తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఈరోజు సాయంత్రం కాల్పుల విరమణ(Ceasefire)కు అంగీకరించామంటూనే మరోసారి సరిహద్దుల్లో డ్రోన్లతో దాడుల(Drone Attacks)కు పాల్పడుతోంది. దీంతో జమ్మూకశ్మీర్‌(J&K)లోని శ్రీనగర్‌(Srinagar)లో భారీ పేలుడు శబ్దాలు(Explosive sounds) వినిపిస్తున్నట్లు స్థానికులు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడిస్తున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సైతం తాజా డ్రోన్ దాడులపై స్పందించారు. భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని, కాల్పుల విరమణ సంగతేంటని ప్రశ్నించారు.

దీటుగా బదులివ్వాలని సైన్యానికి ఆదేశం

ఇదిలా ఉండగా శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్‌(Mortar shells)తో పాక్ రేంజర్లు దాడులకు దిగారు. దీటుగా బదులివ్వాలని భారత ప్రభుత్వం BSF‌కు పూర్తి అధికారాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనగర్‌లో బ్లాక్‌‌అవుట్ (Blackout) విధించారు. అటు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా(Baramulla)లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను కూల్చివేశాయి. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

Operation Karregutta: కర్రెగుట్ట ఆపరేషన్‌లో 31 మంది మావోలు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు(Telangana-Chhattisgarh border) బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కర్రెగుట్ట(Karregutta) కేంద్రంగా జరిగిన ఆపరేషన్‌లో 31మంది మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లు సీఆర్పిఎఫ్ డీజీ జీపీ సింగ్(CRPF DG GP Singh), ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం(DGP Arundev Gautam) తెలిపారు.…

Nikhil: అలాంటి దేశాలకు వెళ్లడం అవసరమా?.. ఆలోచించుకోండి: హీరో నిఖిల్

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్‌ నటుడు నిఖిల్‌ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *