
భారత్-పాకిస్థాన్ సరిహద్దు(India-Pakistan border)ల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్(RS Pura Sector)లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన సబ్ ఇన్స్పెక్టర్(SI) మహమ్మద్ ఇంతియాజ్(Mohammad Intiyaz) దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, SI మహమ్మద్ ఇంతియాజ్ RSపురా సెక్టార్లోని ఒక BSF సరిహద్దు ఔట్పోస్ట్(Outpost)కు నేతృత్వం వహిస్తున్నారు. ఆ సమయంలో సరిహద్దు ఆవలి నుంచి దుండగులు కాల్పుల(open fire)కు తెగబడ్డారు.
We salute the supreme sacrifice made by BSF #Braveheart Sub Inspector Md Imteyaz in service of the nation on 10 May 2025 during cross border firing along the International Boundary in R S Pura area, District Jammu.
While leading a BSF border out post, he gallantly led from the… pic.twitter.com/crXeVFSgUZ
— BSF JAMMU (@bsf_jammu) May 10, 2025
అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి..
కాగా విధి నిర్వహణలో భాగంగా శత్రువులతో పోరాడుతూ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి మహమ్మద్ ఇంతియాజ్(Mohammad Intiyaz) అమరుడయ్యారని BSF అధికారులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది. కాగా అమర జవాన్ ఇంతియాజ్ పార్థివదేహానికి జమ్మూ(Jammu)లోని పలౌరాలో గల ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్(Frontier Headquarters)లో రేపు పూర్తి సైనిక లాంఛనాలతో నివాళులర్పించే కార్యక్రమం జరగనుంది.
Nikhil: అలాంటి దేశాలకు వెళ్లడం అవసరమా?.. ఆలోచించుకోండి: హీరో నిఖిల్
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే వ్యవహారశైలిపై వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తుర్కియే తీరుపై తాజాగా టాలీవుడ్ నటుడు నిఖిల్ (Nikhil) అసహనం వ్యక్తంచేశారు. భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం…