ఆ విషయంలో పవన్ నుంచి ఎంతో నేర్చుకోవాలి: Nidhi Agarwal

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). క్రిష్(Krish), జ్యోతికృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవుతోంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్రం కోసం ఓ యోధుడుగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో పవర్ స్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు.

ఆ పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నా..

‘సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ సర్ ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్(Action) చెప్పగానే పూర్తిగా లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఆయన తన సన్నివేశం(Scenes)పై మాత్రమే దృష్టిపెడతారు. ఈ లక్షణాన్ని నేను కూడా అలవాటు చేసుకోవాలి.’ అని చెప్పారు. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ(horse riding), క్లాసికల్ డ్యాన్స్‌(Classical dance)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని చెప్పారు. కథక్ కూడా నెర్చుకున్నానని తెలిపింది నిధి. కాగా ఈ మూవీ మార్చి 28న థియేటర్లలోకి రానుంది.

Nidhi Agarwal : పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. - NTV Telugu

ఇదిలా ఉండగా ఇవాళ ప్రేమికుల రోజు సంద‌ర్భంగా మేకర్స్ బిగ్ అప్‌డేట్(Update) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్‌ సింగిల్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ‘కొల్లగొట్టిందిరో(Kollagottinadhiro)’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌‌ను ఫిబ్రవరి 24న‌ మధ్యాహ్నం 3 గంటలకు విడుద‌ల చేయనున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *