హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా? మీకో శుభవార్త.. ఇకపై 2 గంటలు హాస్పిటల్‌లో ఉన్నా కవరేజ్

న్యూఢిల్లీ: గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్(Health Insurance clime) పొందాలంటే కనీసం 24 గంటల పాటు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండేది. కానీ తాజా వైద్య సాంకేతికత అభివృద్ధితో పాటు మారుతున్న ట్రీట్మెంట్ విధానాల నేపథ్యంలో ఇప్పుడు కేవలం కొన్ని గంటల చికిత్సకు కూడా బీమా కవరేజ్ అందించే విధంగా పాలసీల్లో మార్పులు తీసుకొస్తున్నాయి.

పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్(Palasi Bazar Health Insurance) హెడ్ సిద్ధార్థ్ సింఘాల్(Sidharth Singhal) వివరించినట్లు, “గత పదేళ్లలో ఆరోగ్యరంగం అమితంగా అభివృద్ధి చెందింది. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు, మెరుగైన డయాగ్నొస్టిక్స్ వలన చికిత్స ప్రక్రియ వేగవంతమైంది. ఇది రోగులు ఆసుపత్రిలో గడిపే సమయాన్ని గణనీయంగా తగ్గించేసింది.” గతంలో కంటిశుక్లం తొలగింపు, కీమోథెరపీ, యాంజియోగ్రఫీ వంటి చికిత్సలకు రాత్రిపూట హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇవన్నీ కొన్ని గంటల్లోనే పూర్తి అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు తమ పాలసీల్లో 24 గంటల హాస్పిటలైజేషన్ నిబంధనను తొలగించి, షార్ట్-టర్మ్ హాస్పిటల్ స్టేకు కూడా కవరేజ్ ఇస్తున్నాయి. దీని వల్ల 2–3 గంటల( Two Hour Hospital Stays) చికిత్సైనా బీమా క్లెయిమ్(Bhima Clime) తీసుకునే వీలుంటుంది. అదనంగా ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేకుండా ఈ ప్రయోజనం అందుతోంది.

ఇలాంటి క్లెయిమ్ సదుపాయం కలిగిన ప్రాముఖ్యమైన ప్లాన్‌ల్లో ఐసీఐసీఐ లొంబార్డ్ ఎలివేట్ ప్లాన్ (ప్రీమియం రూ.9,195), కేర్ సుప్రీం ప్లాన్ (రూ.12,790), నివా బూపా హెల్త్ రీఅష్యూర్ ప్లాన్ (రూ.14,199) ఉన్నాయి. ఈ ధరలు 30 ఏళ్ల వయస్సు గల, పొగ తాగని, మెట్రో నగరాల్లో నివసించే వ్యక్తికి వర్తిస్తాయి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *