రైతులకు కేంద్రం ‘దసరా’ గిఫ్ట్.. ఆరోజే ‘పీఎం కిసాన్‌ నిధులు’ రిలీజ్​

Mana Enadu : ప్రపంచానికే అన్నపూర్ణగా భారతదేశాన్ని నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధి పైనే కాకుండా.. దేశానికి వెన్నెముక అయిన రైతుల ప్రగతిపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర సర్కార్  “ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి(pm kisan samman nidhi)” పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఏటా మూడు దఫాల్లో నగదు జమ

2019 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన ఈ పథకం (PM Kisan Funds) ద్వారా పంట సాయంగా ఎకరానికి ఏడాదికి 6 వేల రూపాయలను కేంద్రం అందిస్తోంది. ఏటా మూడు దఫాలుగా (అంటే ఓక్కో దఫాకు రూ.2 వేలు) నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతగా ఏప్రిల్ – జులైలో, రెండో విడతలో ఆగస్టు- నవంబరులో, మూడో విడతలో డిసెంబర్-మార్చిలో 2 వేల చొప్పున అందిస్తోంది.

రైతులకు మోదీ దసరా కానుక

ఇప్పటికే 17 విడతల్లో ఈ ఆర్థిక సాయాన్ని అందించిన మోదీ సర్కార్ (Modi Govt) తాజాగా 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీని ప్రకటించింది. దసరా కానుకగా 18వ దఫా పీఎం కిసాన్ డబ్బుల( PM Kisan 18th Installment)ను “2024, అక్టోబర్ 5వ తేదీన” ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రూ. 2 వేలు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని వెబ్​సైట్​లో సూచించారు. 

e-KYC ఎలా చేయాలంటే? :

  • మొదట  https://pmkisan.gov.in/ లో లాగిన్​ అవ్వాలి.
  • హోమ్​ పేజీలో కుడివైపు e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి ‘Search’​ ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.
  • లేదా పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రాసెస్ చేయొచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *