ఢిల్లీలో బీజేపీ విజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే?

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో (Delhi Assembly Election Results 2025) బీజేపీ ఘనవిజయం సాధించింది. 77 అసెంబ్లీ స్థానాలున్న హస్తినలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కమలం పార్టీ 41 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో గెలుపొంది.. 4 స్థానాల్లో ముందంజలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటిన బీజేపీ ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో విజయఢంకా మోగించింది.

ఢిల్లీ ప్రజలకు థ్యాంక్యూ

ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. దేశ రాజధానిలో అభివృద్ధి, సుపరిపాలనే గెలిచాయని ఆయన. ఢిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ విజయం కోసం పగలు, రాత్రి కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరిని అభినందించారు.

అంకితభావంతో ముందుకు సాగుతాం

“హస్తిన సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మేము ఏ అవకాశాన్ని వదులుకోబోము. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో దేశరాజధాని (Delhi Results 2025) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా అంకితభావంతో ముందుకు సాగుతాం.” అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *