మన ఈనాడు:
ప్రజలతో ప్రత్యక్షంగా 40ఏళ్లుకు పైబడి రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు..ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేస్తే..ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనకే సొంతం..భాన్సువాడ (BANSWADA) నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోచారం శ్రీనివాస్రెడ్డికి (POCHARAM SRINIVAS REDDY) ప్రజల్లో తనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ పోచారానికి పోటీనే లేదు..కారు స్పీడ్కు ఎదురొచ్చి నిలబడే సత్తా, ధైర్యం మరోపార్టీ చేయదు.
1994లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే 1998లో గృహనిర్మాణశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి మంత్రి గనులశాఖ, పంచాయితీరాజ్ మంత్రి పదవులు చేపట్టారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 2011 టిడిపికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టిఆర్ఎస్లో చేరాక జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు ఆయనకు భాన్సువాడలో తిరుగులేదు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వంలో తొలి వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం రికార్డు సాధించారు. 2019లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్గా కొనసాగుతున్నారు. భాన్సువాడ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో పోచారం మార్కు కనిపిస్తుంది. 9మండలాలతో కూడిన భాన్సువాడ నియోజకవర్గం ఏ పల్లెకు వెళ్లినా పోచారం వేసిన బాట..పోచారం చేసిన మార్కు ఉండాల్సిందే.
భాన్సువాడ, బిర్కూరు, నర్సులాబాద్, వర్ని, కొటగిరి, రుద్రూరు, చందూరు, మోస్రా, పొతంగల్ మండలాల్లో ఎటు చూసినా పోచారం అందించిన సాయం ఆయన చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా దేవాలయాల అభివృద్ధిలో ఆయన చేసిన పాత్ర మరవలేనిది. సీఎం కేసీఆర్ లక్కి నెంబరు 6 అయితే..భాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్రెడ్డి ఆరోవసారి విజయం సాధించి రికార్డు సృష్టించబోతున్నారు. తెలంగాణ 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే మొదటిస్థానం భాన్సువాడ నియోజకవర్గమే.