సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై AP పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నరసరావుపేట పోలీస్స్టేషన్(Narasa Raopet Police Station)లో ఆయనపై కేసు నమోదైంది. BNS 153A 67 ఇట్ యాక్ట్ 504 సెక్షన్ల కింద ఆయనపై కేసు ఫైల్ అయ్యింది. ఈ క్రమంలో పీటీ వారెంట్(PT Warrant)తో రాజంపేట సబ్ జైలుకు చేరుకున్నారు నరసరావుపేట పోలీసులు. రాజంపేట(Rajampet) సబ్జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబ్ జైల్లో గత 4 రోజులుగా పోసాని రిమాండ్ ఖైదీ(Remand prisoner)గా ఉన్న విషయం తెలిసిందే. నరసారావుపేట టూ టౌన్ CI హేమారావు ఆధ్వర్యంలో నరసరావుపేటకు పోసానిని తరలించారు.
పీటీ వారెంట్తో నరసారావుపేటకు..
కాగా.. పోసాని కృష్ణ మురళిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్జైలుకు దారిపట్టారు. ఇందులో భాగంగా రాజంపేట సబ్జైలులో ఉన్న పోసాని కోసం పీటీ వారెంట్తో ఈరోజు (సోమవారం) నరసారావుపేట పోలీసులు వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున గతంలో పోసానిపై నరసరావుపేటలో కేసు నమోదైంది.

దీంతో నరసారావుపేట పోలీసులు రాజంపేట సబ్జైలుకు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని నరసారవుపేటకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం(Court) నిర్ణయం మేరకు నరసారావుపేట సబ్ జైలులో ఉంచుతారా? లేక రాజంపేటకు తరలిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
పోసాని కృష్ణ మురళిని PT వారెంట్ పై అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు..
153A,504,67 ఐటీ యాక్ట్ కింద పోసానిపై కేసు నమోదు..@posani_kmurali @YSRCParty pic.twitter.com/EYCjK0lb1a
— Telangana Awaaz (@telanganaawaaz) March 3, 2025








