పోసానికి 14 రోజుల రిమాండ్.. ఖైదీ నంబర్ ఎంతంటే ?

సినీనటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి రైల్వేకోడూరు మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9.30 నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిన వాదనల్లో పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్‌ యాక్ట్‌ (BNS Act) ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు పోసానికి రిమాండ్‌ విధించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

14 రోజుల రిమాండ్

ఇరువైపు వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ మార్చి 12వ తేదీ వరకు పోసానికి రిమాండ్ విధించింది. అనంతరం పోసానిని పోలీసులు రాజంపేట సబ్‌ జైలుకు తరలించారు. పోసాని కృష్ణమురళికి ఖైదీ నంబర్ 2261 కేటాయించారు. సినీ పరిశ్రమపై విమర్శలు చేశారని పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ఆయణ్ను హైదరాబాద్ లోని తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై ఓబులవారిపల్లె పోలీసులు 196, 353(2), 111 రెడ్‌ విత్‌ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొచ్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *