బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 11 మంది సెలబ్రిటీలపై కేసు

ఆన్ లైన్ బెట్టింగ్‌ యాప్స్‌ (Online Betting Apps) ప్రమోట్‌ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సొంత లాభం కోసం అమాయకులు మోసపోయేలా ప్రేరేపిస్తున్న పలువురు సెలబ్రిటీలపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా.. వీరి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానలేదు.

సెలబ్రిటీలపై కేసు నమోదు

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సోషల్‌ మీడియా, టీవీ నటులపై పంజాగుట్ట కేసులు నమోదు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ (Tasty Teja), కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ (Vishnu Priya), యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్‌ లపై కేసు ఫైల్  చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *