VC Sajjanar: ఆర్టీసీ ద్వారా మీ ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు

ఈ ఏడాది ఏప్రిల్ 6న శ్రీరామనవమి(Sri Ramanavami) రోజున జరిగే భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మీరు వెళ్లలేకపోతున్నారా? మీకు సీతారాముల కళ్యాణం తలంబ్రాలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా రాములోరి భక్తులకు TGSRTC ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) శుభవార్త అందించారు. పవిత్ర భద్రాద్రి సీతారాముల కళ్యాణం తలంబ్రాలను మీ ఇంటికే పంపించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్గో(RTC Cargo) ద్వారా తలంబ్రాల(Talumbras)ను మీ ఇంటికి తీసుకొస్తామని తెలిపారు. అయితే అందుకు మీరు చేయాల్సిందల్లా రూ.151 రూపాయి చెల్లించి ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఏప్రిల్ 6న భద్రాద్రిలో రాములవారి కళ్యాణం

కాగా ఏప్రిల్ 6వ తేదీన భద్రాద్రిలో రాములవారి కళ్యాణం వైభవంగా జరగనుంది. గత ఏడాది కూడా భక్తులకు తలంబ్రాలను ఇంటికి చేరవేసింది. దేవదాయ శాఖ(Endoment Department) సహకారంతో స్వామివారి కళ్యాణ తలంబ్రాలను ఈసారి కూడా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చే కార్యక్రమానికి TGSRTC శ్రీకారం చుట్టింది. కాగా ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్(tgsrtclogistics.co.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కాల్ సెంటర్ నెంబర్లు 040-69440069, 040-69440000లను సంప్రదిస్తే టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు ఆర్డర్లను స్వీకరిస్తారని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

Related Posts

Heavy Rains: మూడు రోజులు భారీ వర్షాలు.. ఎవరూ బయటికి రావొద్దన్న హైడ్రా

హైదరాబాద్ నగరం(GHMC)లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. 13, 14, 15 తేదీల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు…

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

గతవారం వరకూ ఎడతెరిపి లేని వర్షాలు(Rains) హైదరాబాద్(Hyderabad) వాసులను అతలాకుతలం చేశాయి. కనీసం బట్టలు ఆరబెట్టుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు వరుణుడు. అయితే ఎట్టకేలకు నాలుగు రోజులుగా ఎండలు కొడుతున్నాయి. కానీ నిన్న (ఆగస్టు 4) సాయంత్రం భారీ వర్షంతో మరోసారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *