Ramayana: ‘రామాయణ’ మూవీపై కీలక అప్డేట్.. జెట్ స్పీడుతో పార్ట్-2 షూటింగ్

యుగాలు, తరాలు మారినా.. రామాయణ(Ramayana) కథ మాత్రం నిత్య నూతనం. ఈ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు తెరపై చూపించినా అందులో కొత్తదనాన్ని వెతుక్కొని మరీ ఆస్వాదిస్తుంటారు ప్రేక్షకులు. ఇక స్టోరీని బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ(Director Nitesh Tiwari) కాస్త కొత్తగా తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor), సాయిపల్లవి(Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తాజాగా రెండు పార్టులుగా తీయబోతున్నట్లు డైరెక్టర్ అధికారికంగా ప్రకటించారు. దీనిని 2026లో దీపావళి పండక్కి రిలీజ్ చేయనున్నట్లు అల్రెడీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తొలి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు బీటౌన్‌లో చర్చ నడుస్తోంది.

Ramayana': Ranbir Kapoor, Yash And Sai Pallavi Eyed For Nitesh Tiwari's  Film | HerZindagi

సాయిపల్లవిపై కీలక సన్నివేశాలు షూట్

ఇక లేటెస్ట్‌గా పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. బాలీవుడ్(Bollywood) వర్గాల ప్రకారం మేకర్స్ పార్ట్ 2 షూటింగ్‌(Part-2 Shooting)ని కూడా ప్రారంభించారట. ప్రస్తుతం సాయి పల్లవిపై లంకలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే రణబీర్ సింగ్‌పై సన్నివేశాలని తెరకెక్కించనున్నారట. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామాయణ రెండో భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీలో ఈ చిత్రంలో రావణుడిగా యశ్(Yash), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny Deol) కనిపించనున్నారు. బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌(Allu Aravnd) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Featured Story

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *