Ration Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేషన్ కార్డులకి డేట్​ ఫిక్స్​?

Telangana : కొత్త రేషన్ కార్డులు (New Ration Card) ఎప్పుడొస్తాయా అని అతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) శుభవార్త చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కోడ్ (Election Code) ముగియగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా ప్రకటిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా రేషన్ కార్డులు మాత్రం రాలేదు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. గత బీఆర్ఎస్ (BRS)​ ప్రభుత్వం రేషన్​ కార్డులు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేసింది.

సంక్షేమ పథకాలు అందుకునే వారు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ రేషన్ కార్డు ఉంటేనే పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారంటీలకు అర్హులు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ మొదలుపెడతాం. రేషన్ కార్డులు లేక పేద, మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *