TDP|ఏపీలో మరో సంచలనం..అంగన్ వాడీ టీచర్ MLA

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా అధికార పార్టీ కేవలం 142 స్థానాల్లో ఓటమి చెందింది.

 కీలక నేతలను కాదని సాధరణ నేత రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. కాగా అల్లూరి జిల్లా రంపచోడవరం (Rampa Chodavaram MLA)నియోజకవర్గంలో ఓ సాధరణ మహిళ ఎమ్మెల్యేగా గెలుపొందింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మిర్యాల శిరీషా దేవి(Miriyala Sirisha Devi) అనూహ్య విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మీపై 9,139 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. పెద్దగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లేని ఓ అంగన్ వాడీ టీచర్‌ను గెలిపించిన ఘనత రంపచోడవరం ఓటర్లకు దక్కింది. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో ఘన విజయం సాధించగా అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది.

Share post:

లేటెస్ట్