
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) సినీ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘వెంకీ(Venky)’ ఒకటి. శ్రీను వైట్ల(Srinu vaitla) దర్శకత్వం వహించిన ఈ మూవీని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. ఇందులో స్నేహ(Sneha) హీరోయిన్గా నటించగా.. అశుతోష్ రాణా, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్ తదితరులు ప్రధాన పాత్రలో నటించాడు. 2004లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది.
ఇప్పటికే రెండుసార్లు రీరిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా భారీ బిజినెస్ చేసింది. దీంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నెల 14న మరోసారి బిగ్ స్క్రీన్పై ఆడియన్స్ కోసం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రివీల్ చేయగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ట్రైన్లో సీన్లలో వచ్చిన కామెడీ, వెంకీ మాస్ యాక్టింగ్ను మళ్లీ తెరమీద చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.