Mobile Market: వివో దెబ్బకు శామ్‌సంగ్ డౌన్.. మొబైల్ కంపెనీ ర్యాంకింగ్స్ ఇవే!

మొబైల్ ఫోన్.. ప్రస్తుత టెక్ యుగం(Smartphone Market)లో దాని వ్యాల్యూ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిత్యం మార్కెట్లోకి వందలాది కంపెనీలు లాంచ్ అవుతున్నాయి. కానీ ఎన్ని కొత్త బ్రాండ్(New Brands) కంపెనీలు వచ్చినా.. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత కలిగిన కొన్ని బ్రాండ్లు ఎప్పటికీ తమదైన ముద్ర వేస్తుంటాయి. ఆ కోవలోకి చెందినవే శామ్‌సంగ్(Samsung), ఐఫోన్, ఓప్పో, వివో, జియో, షియోమీ, మోటరోలా మొదలైనవి. వినియోగదారులకు ఎప్పటి నుంచో సేవలు అందిస్తోన్న శామ్‌సంగ్ టెక్ యుగంలో తనదైన ముద్రవేసింది. అయితే తాజాగా ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(International Data Corporation) ప్రకటించిన నివేదికలో శామ్‌సంగ్ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయింది.

తాజా నివేదిక(Report 2024) ప్రకారం 2024లో మొబైల్ కంపెనీలకు సంబంధించి శామ్‌సంగ్ తన మార్కెట్ వాటాలో 4 శాతం కోల్పోయింది. ఈ సౌత్ కొరియా కంపెనీ వాటా 17 నుంచి 13.2 శాతానికి పడిపోయి రెండో స్థానంలో నిలిచింది. వివో(Chaina) 15.2 నుంచి 16.6 శాతానికి చేరి టాప్‌లో నిలిచినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) వెల్లడించింది. ఐఫోన్ మార్కెట్ 6.4 నుంచి 8.2 శాతానికి చేరినట్లు తెలిపింది.

టాప్-10లో ఉన్న కంపెనీలు ఇవే..

వివో 16.6శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది.
శాంసంగ్ 13.2%
ఒప్పో 12%
షియోమీ 12%
రియల్ మీ 11%
ఆపిల్ 8.2%
మోటరోలా 6%
పోకో 5.6%
వన్ ప్లస్ 3.9%
ఐక్యూ 3.3%
ఇతర కంపెనీలు 8.2% మార్కెట్ వ్యాల్యూ కలిగి ఉన్నాయి.

Related Posts

Gold Rates: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం రేటు ఎంతంటే?

బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధరలు ప్రస్తుతం రూ.89 వేలకు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం శుభ కార్యాల సీజన్ కావడంతో అది కాస్త రెట్టింపు అయింది. దీంతో పేద,…

Reliance Jio మరో అదిరిపోయే ఆఫర్.. రూ.100కే ఓటీటీ ప్లాన్

రిలయన్స్ జియో(Reliance Jio) తమ యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఓ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌(New recharge plan)ను అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే ఇది కాల్స్(Calls) చేసుకునే వారి కోసం మాత్రం కాదు. OTT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *