
విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో (Vijay sethupathi) టాలీవుడ్ క్రేజీ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో నటించనున్న నటీనటుల జాబితాను మేకర్స్ వరుసగా ప్రకటిస్తూ మరింత బజ్ను పెంచుతున్నారు. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమాలో మరో నటిని భాగం చేశారు.
ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం
ఈ క్రేజీ ప్రాజెక్ట్లో సంయుక్త (Samyuktha) జాయిన్ అయినట్లు తెలుపుతూ టీమ్ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం.. అంటూ సంయుక్తకు స్వాగతం పలుకుతూ ఆమెతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇందులో ఆమె పాత్ర కీలకంగా ఉండనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు మొన్నటివరకూ వార్తలు వచ్చాయి. తాజాగా ‘భిక్షాందేహి’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
శరవేగంగా సాగుతున్న పనులు
‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఫ్లాప్ అవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నారు. ఓ మంచి కథ రాసుకొని దాన్ని విజయ్ సేతుపతికి వినిపించడంతో.. కథ ఎంతగానో నచ్చిన సేతుపతి ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నటీనటులను ఎంపిక చేసే పనుల్లో చిత్రబృందం బిజీ అయ్యింది.
Grace in her stride. Fire in her eyes.
Welcoming the stunning @iamsamyuktha_ on board into the electrifying world of #PuriSethupathi ❤️🔥❤️🔥❤️🔥
A #PuriJagannadh film
Starring Makkalselvan @VijaySethuOffl, #Tabu, and @OfficialVijiProduced by Puri Jagannadh & @Charmmeofficial under… pic.twitter.com/RzlZMBs4DJ
— Puri Connects (@PuriConnects) June 17, 2025