ఢిల్లీలో మరో భవనం (Building Collapse) కుప్పకూలింది. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆరు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడాయి.
నలుగుగురు మృతి
అయితే ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు 14 మందిని కాపాడినట్లు వెల్లడించారు. వెంటనే వారిని జీటీబీ ఆస్పత్రి(GTB Hospital in Delhi)కి తరలించగా అందులో నలుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు. భవనం కూలిన సమయంలో శిథిలాల కింద 22 మంది చిక్కుకున్నట్లు తెలిసిందని.. ఇంకా 8 మంది వాటి కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వారిని వెలికితీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నట్లు వివరించారు.
VIDEO | CCTV footage of the building collapse in Delhi’s Dayalpur area.
A four-storey building collapsed in Delhi’s Dayalpur area late last night, trapping several people. A rescue operation is underway to save those tapped inside the rubble.
(Source: Third Party)
(Full… pic.twitter.com/i2Mx6BWABl
— Press Trust of India (@PTI_News) April 19, 2025
సీసీటీవీ దృశ్యాలు వైరల్
శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఢిల్లీ పోలీసులు (Delhi Police) సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భవంతి కుప్పకూలిందని.. తమకు 3:02 గంటలకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. భవనం కూలుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే భవనం కూలడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.






