
తక్కువ బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఆశించినదానికంటే మంచి కలెక్షన్లు సాధించిన చిత్రం ‘శుభం’(Shubham) సినిమాబండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మే 9న విడుదలై ప్రేక్షకులను అలరించింది. సెటైరికల్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ను మిళితం చేసిన ఈ రూరల్ ఫ్యామిలీ డ్రామా, విడుదలైన ఐదు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. సమంత(Samantha) ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించటమే కాకుండా అతిథి పాత్రలో కూడా కనిపించింది.
ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వలు కీలక పాత్రల్లో నటించారు. చిన్న బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా, సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 13 నుండి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించగా, తాజాగా ఓటీటీ ట్రైలర్(Trailar)ను కూడా విడుదల చేశారు.
వైజాగ్లోని భీమిలీపట్నం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ముగ్గురు యువ జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల చుట్టూ తిరుగుతుంది. యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పుడు సుమారు బ్లాక్బస్టర్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. డెబ్యూ దర్శకుడి విజన్, నేచురల్ నేరేషన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇప్పుడు ఓటీటీ(OTT) ప్లాట్ఫార్మ్ ద్వారా మరింత విస్తృత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనున్న ఈ చిత్రం, జియో హాట్స్టార్లో ఎలాంటి రెస్పాన్స్ను పొందుతుందో చూడాలి!