నాగచైతన్యలో అలాంటి ప్రేమను చూశాను : శోభితా ధూళిపాళ్ల

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిశ్చితార్థం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సమక్షంలో ఆగస్టు 8న హైదరాబాద్ లో చాలా నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. తాజాగా ఆ పోస్ట్‌ వెనక ఉన్న కారణాన్ని ఆమె ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘చై’లో ఆ ప్రేమను చూశా

“నాకు సంగం సాహిత్యం (తొలినాళ్లలో తమిళ సాహిత్యానికి పెట్టిన పేరు ఇది (Sangam Sahityam)) అంటే చాలా ఇష్టం.  నా ఎంగేజ్మెంట్ పోస్ట్‌లో పెట్టిన సాహిత్యం.. గతంలో ఈ సాహిత్యంలో నేను చదివినదే. హృదయాలను హత్తుకునే సందేశం ఉంది. అందుకే దానికి నా మనసులో ప్రత్యేక స్థానముంది. నేను ఎప్పుడూ అలాంటి అద్భుతమైన ప్రేమను పొందాలనుకుంటున్నాను. నా భాగస్వామి (నాగచైతన్య)లో అదే ప్రేమను చూశాను’’ అని శోభితా ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది.

శోభితా పెట్టిన పోస్టు ఇదే 

‘‘మా అమ్మ నీకు ఏం కావచ్చు? నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? నువ్వు, నేను ఎలా కలిశాం? కానీ, ఈ ప్రేమలో మన హృదయాలు కలిశాయి. విడిపోవడానికి మించి కలిసిపోయాయి’’ అని శోభితా ధూళిపాళ్ల రాసుకొచ్చింది. ఇక ఈ వేడుక సింపుల్‌ (Naga Chaitanya Shobita Dhulipala Engagement)గా జరగడంపై మాట్లాడుతూ..నిశ్చితార్థ వేడుక గ్రాండ్‌గా జరగాలని తానెప్పుడూ కోరుకోలేదని తెలిపింది. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా వేడుక జరిగిందని వెల్లడించింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *